Wednesday, January 28, 2009

ఆశ - అడియాస

కొత్త సంవత్సరం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మనకు దొరతనపు దోపిడీలకు పాల్పడుతున్న పాలకులు, మానభంగాలకు పాల్పడుతున్న వారి సంతానం ,కాస్తో కూస్తో కూడబెట్టుకున్న సంపాదనను స్టాకు మార్కెట్టు దళారుల మాయాజాలం తో తుడిచి పెట్టుకుపోతున్న తరుణంలో , అసలు ఎవరి కొరకు మన ప్రభుత్వము పని చేస్తున్నదో అర్తం కావడం లేదు. గాలి బుడగల మీద ఎన్ని రోజులని నడవాలి? తీరు మారాలిసింది మనలోనన లేక పాలకులలోనన , తేల్చుకునే సమయము వస్తున్నది, వోటు వేయడం లో నిర్లిప్తత వహిస్తే మల్లి అయిదు ఏల్లు నడిచేందుకు గాలిబుడగలు కూడా ఉండవు అనే చేదునిజం తప్ప ప్రయోజనం ఉండదు. మనలని నీది, నీకు, నీస్వంతం, నీకోసమే అని విభజించే దళారుల పాలనకు స్వస్తి పలుకుదాం. మన దేశంలో నూటికి డెబ్బై మందికి భూమి పయి ఎలాంటి హక్కు లేకుండా జీవిస్తున్నారు . అలాంటప్పుడు భూమి మీద యాజమాన్యపు హక్కు మనకు లేకుండా చట్టం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉండవుకదా. మీరు ఆలోచించండి , మీ ఆలోచనను ఇతరులతో పంచుకోండి, కొత్త జవాభు దొరుకుతుందేమో ప్రయత్నిద్దాము.

0 comments:

Post a Comment